తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మోహిదీపట్నం నుంచి ఖాజాగూడ మార్గం మధ్య రూ.69.47 కోట్లతో మొత్తం 990 మీటర్ల పొడవు నిర్మించిన బయో డైవర్సిటీ సెకండ్ లెవర్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,మేయర్ బొంతు రామ్మోహాన్ తో పాటు స్థానిక కార్పోరేటర్లు,పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు. ఈ బయో డ్రైవర్సిటీ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణంతో కొంతమేరకు ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ప్రజలు హార్షం వ్యక్తం చేస్తోన్నారు.