రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకోవాలంటే ముప్పుతిప్పలు పడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అధికారుల చేతివాటం దగ్గరనుంచి లంచాలు దగ్గర్నుంచి విద్యార్హత టికెట్ల విషయంలో అనేక ఇబ్బందులకు గురయ్యారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్న వారికి ఎటువంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంది. పాదయాత్రలో తనను కలిసిన యువకులు తమకు చదువు లేక ఏదో ఒక పని చేసుకోవాలి అనుకుంటున్నా అని దీనికి డ్రైవింగ్ తో పాటు కొన్ని సూచనలు చేస్తే సరిపోతుందని వాటిలో శిక్షణ తీసుకుని డ్రైవింగ్ చేసుకునేలా తమకు అవకాశం కల్పించాలని కోరారు దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
