దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం గాలి ప్రమాదకరంగా మారిపోయింది. ఇదంతా దీపావళి తరువాత చోటుచేసుకున్నవే. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోయాయని చెప్పాలి. ఊపిరి పీల్చుకోవడానికి, కంటివెలుగు ఇలా ఎన్నో సమస్యలు ఢిల్లీ వాసులు ఎదుర్కుంటున్నారని ఈమేరకు ఫిర్యాదులు కూడా వచ్చాయని ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది. గాలి నాణ్యత సూచిక (AQI) 423 వద్ద డాకింగ్ చేస్తోంది, ఇది ప్రమాదకర విభాగంలోకి వస్తుంది అని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ తెలిపింది. దీపావళి రాత్రి, PM 2.5 స్థాయి దాదాపు ఐదు రెట్లు పెరిగిందని తెలిపింది. మఖ్యంగా దీపావళి తరువాత పూర్తి స్థాయిలో కాలుష్యం పెరిగిపోయింది.