ఈరోజుల్లో నమ్మకాలు, మూడనమ్మకాలు వల్లే కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏమీ తెలియని వారిని పక్కన పెడితే, అన్ని తెలిసిన వారు కూడా మూడనమ్మకాలను గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ లిస్ట్ లో ప్రస్తుతం చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా చేరారు. ఈ మేరకు ఆయన కొరడా దెబ్బలు తిన్న వార్త ప్రస్తుతం చాలా ఆశక్తికరంగా మారింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అక్కడ దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్ళగా.. అక్కడ సంప్రదాయాల పరంగా గుడిలో పూజారి భక్తులను కొరడాతో కొడతారు. అదేవిధంగా ఈయన కూడా గుడికి వెళ్ళగా పూజారితో తనని కొట్టమన్నారు. దాంతో పూజారి ఆయను కొరడాతో కొడతారు. అలా చేయడం వల్ల తీరని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.
