Home / MOVIES / ఈ ముగ్గురిలో ఈ రోజు ఎవరు ఎలిమినేట్‌..! దీపావళీ ఇంట్లో చోసుకుంది ఎవరు..?

ఈ ముగ్గురిలో ఈ రోజు ఎవరు ఎలిమినేట్‌..! దీపావళీ ఇంట్లో చోసుకుంది ఎవరు..?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3  మరోవారం రోజుల్లో ముగియనుంది. 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ రియాలిటీ షోలో ప్రస్తుతం ఆరుగురు మిగిలారు. ఇక ఈ వారం అలీ రెజా, శివజ్యోతి, వరుణ్‌,శ్రీముఖి నామినేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, శనివారం నాటి ఎపిసోడ్‌లో ఒకరు లేదా ఇద్దరు సేవ్‌ అయ్యే అవకాశముందని హోస్ట్‌ నాగార్జున చెప్పాడు. ఎవరెవరు సేవ్‌ అవుతారో తెలుసుకోవడానికి దీపావళీ సందర్భంగా.. వారి పేర్లు రాసి ఉన్న పార్టీ పూపర్స్‌ గన్‌ తలా ఒకటి ఇచ్చి పేల్చమన్నాడు.

ఎవరి గన్‌ నుంచి రంగురంగుల కాగితాలు బయటికొస్తాయో.. వారు సేవ్‌ అవుతారని తెలిపాడు. మిగిలినవారు నామినేషన్‌లోనే ఉంటారని చెప్పాడు. ముందుగా వరుణ్‌, తర్వాత అలీ గన్‌ పేల్చగా.. వాటిల్లో ఎలాంటి రంగులు రాలేదు. దాంతో వారిద్దరూ సేవ్‌ కాలేదని నాగార్జున తెలిపాడు. ఇక శివజ్యోతి, శ్రీముఖి వారి చేతుల్లో ఉన్న గన్‌లను పేల్చలేకపోయారు. రెండో ప్రయత్నంలో శ్రీముఖి గన్‌ పేల్చగా.. దాట్లోంచి రంగుల కాగితాలు వచ్చాయి. దాంతో శ్రీముఖి సేవ్‌ అయి టికెట్‌ టు ఫినాలేకు చేరుకున్నట్టు నాగ్‌ ప్రకటించాడు. ఇక శివజ్యోతి గన్‌లో నుంచి ఎలాంటి రంగుల కాగితాలు రాకపోవంతో ఆమె కూడా సేవ్‌ కాలేదని నాగ్‌ వెల్లడించాడు. వరుణ్‌, శివజ్యోతి, అలీరెజా ముగ్గురూ నామినేషన్‌లో కొనసాగుతున్నారు.ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది. అయితే, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తక్కువగా ఉన్న శివజ్యోతి ఎలిమినేట్‌ అయినట్టు సోషల్‌ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat