ప్రధానమంత్రి నరేద్రమోదీ దీపావళి సంబరాలు భారత ఆర్మీతో కలిసి జరుపుకున్నారు. జమ్మూలోని రాజౌరీ ఆర్మీ క్యాంప్కు చేరుకున్న ప్రధాని ఆర్మీ యూనిఫాం ధరించి దివాళి వేడుకల్లో పాల్గొనడం గమనర్హం. ప్రధాని రాకతో జవాన్లంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని జవాన్లకు తానే స్వయంగా మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు సహా జవాన్లకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Like he has done during previous Diwalis, PM @narendramodi celebrated this festival with soldiers protecting India.
He went to Rajouri in Jammu and Kashmir, where he interacted with soldiers and exchanged sweets.
Here are some pictures. #Diwali pic.twitter.com/AfaNOhfMr1
— PMO India (@PMOIndia) October 27, 2019
ప్రధాని మాట్లాడుతూ.. ఈ సంవత్సరం దీపావళిని జవాన్లతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. దేశ ప్రజలంతా పండుగను ఆనందంగా జరుపుకోవాలనీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తగా, పరిమితిగా టపాసులు కాల్చాలని ఆయన సూచించారు. అనంతరం ఆయన భారత ఆర్మీ వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు. వారి పనితీరును పరిశీలించిన ప్రధాని వారి సేవలను కొనియాడారు. కాగా జమ్మూకశ్మీర్కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోదీ జమ్మూ వెళ్లడం ఇదే తొలిసారి.
A memorable moment from the #Diwali celebrations in Rajouri… pic.twitter.com/rsOJiq5XLq
— PMO India (@PMOIndia) October 27, 2019