గతంలో పల్నాడు ప్రాంతంలో జరిగిన నా వివాదాల నేపథ్యంలో చలో ఆత్మకూరుకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో చంద్రబాబు ఇంటి వద్ద నుంచి బయలుదేరి వెళ్లేందుకు టిడిపి శ్రేణులు అంతా అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్కడి పోలీసులు ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్టుపిడ్ ఫెలో వేస్ట్ ఫెలోస్ అంటూ దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. దీంతో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడు పై పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు ఈ క్రమంలో లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ కు అప్లై చేసి స్టే తెచ్చుకున్నారు అచ్చెన్నాయుడు. అయితే తాజాగా మంగళగిరి కోర్టులో లొంగిపోవాలని న్యాయమూర్తికి వివరణ ఇవ్వాలని మంగళగిరి కోర్టు అచ్చెంనాయుడు కి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అచ్చన్నాయుడు మంగళగిరి కోర్టు హాజరై 50వేల పూచికత్తు తో విడుదలయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్న అనే భ్రమలో అహంభావంతో పోలీస్ అధికారులను దుర్భాషలాడుతూ ఎలా ఉంటుందో అచ్చెంనాయుడు కి తెలిసొచ్చింది.