టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి తొలిసారిగా ఒక యాడ్ లోనటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడిస్తూ, అందరమూ కలిసి తొలిసారిగా నటించామని అన్నారు. షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని చెబుతూ, ఆ యాడ్ ను పోస్ట్ చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్ ను నిర్మించిందని, అందుకు కృతజ్ఞతలని తెలిపారు.
