హుజూర్నగర్ శాసనసభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరుగుతోంది. ఇవాళ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మఠంపల్లి మండలంలోని తన స్వగ్రామం గుండ్లపల్లిలో ఓటు వేశారు. హుజూర్ నగర్ బరిలో మొత్తం 28మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గ ప్రజలు (2,36,842 మంది ) తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలను అక్టోబరు 24న ప్రకటిస్తారు. కాగా రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉపఎన్నిక కావడంతో అందరి దృష్టి హుజూర్నగర్పై నెలకొంది.
