టీమిండియా మాజీ ఓపెనర్,సీనియర్ ఆటగాడు,ప్రస్తుత కేంద్ర అధికార బీజేపీ పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన ఔధార్యాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా గుండె జబ్బుతో బాధపడుతున్న పాకిస్థాన్ కి చెందిన ఏడేళ్ల చిన్నారైన ఒమైనా అలీకి వీసా లభించడంలో గంభీర్ సాయపడ్డాడు.
ఒమైనాకు సాయం చేసేందుకు ముందుకురావాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖకు గంభీర్ లేఖ రాశారు. గంభీర్ రాసిన లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్ స్పందిస్తూ ఒమైనాకు కావాల్సిన వీసాకు అవసరమైన ఏర్పాట్లను చేయించారు.
అంతేకాకుండా ఆ చిన్నారి చికిత్సకు అవసరమైన వైద్యానికి సంబంధించి ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో గంభీర్ చూపిన చొరవకు నెటిజన్లు ఫిదా అయ్యారు.