ప్రముఖ నటి రమ్యకృష్ణ 20ఏళ్ల తరువాత తన భర్త కృష్ణవంశీ దర్శకత్వం లో నటించబోతుంది. మరాఠీలో సూపర్ హిట్ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్గా వస్తున్న ఈ చిత్రానికి ‘రంగమార్తాండ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. దీనికి సంభందించి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలో నటించనున్నారు. చాలా గ్యాప్ తరువాత క్రిష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తాను తీసిన చివరి సినిమా నక్షత్రం ఫ్లాప్ అయిన విషయం అందరికి తెలిసిందే. అప్పటినుండి సైలెంట్ గా ఉన్న దర్శకుడు ఇప్పుడు మల్లా అడుగుపెట్టాడు.
