క్రికెట్ ప్రియులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే మామోలుగా టీ20 సిరీస్ అంటేనే ఒక పండుగ వాతావరణం తలపిస్తుందని అందరికి తెలిసిందే. అలాంటిది ఈ సిరీస్ లో దిగ్గజ ఆటగాలు పాల్గొంటున్నారు. అంటే ఇంకెంత మజా వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇక అసలు విషయానికి వస్తే రోడ్ సేఫ్టీ టీ20 సిరీస్ ను ముంబై లో నిర్వహించబోతున్నారు. దీనికి సంభందించి 2020 ఫిబ్రవరి నెలలో ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అంతేకాకుండా ఇందులో ఐదు జట్లు ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, శ్రీలంక పాల్గొంటాయి. ఇందులో భాగంగానే దిగ్గజ ఆటగాలు సచిన్, లారా, మురళీధరన్, సెహ్వాగ్ సైతం ఆడనున్నారు.
