తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఆర్టీసీ సమ్మెపై ఈ రోజు మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సుధీర్ఘంగా విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
అందులో భాగంగా హైకోర్టు సమ్మె చేయడం మంచి పద్ధతి కాదు. నిరసన తెలపడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో నిరసన చెబుతే బాగుంటుంది. ముందు సమ్మె విరమించండి.
సమ్మెను విరమించి ప్రభుత్వం తో చర్చలు జరపండి అని సిబ్బందికి సూచించింది. అంతే కాకుండా ఆర్టీసీ సమ్మెతో ప్రజలు,ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకోవాలని సలహాలు ఇచ్చింది.