కేసులు నమోదైన తర్వాత నుంచి తన భర్త భార్గవ్రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదని, తనతో టచ్లో లేరని ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. పారిపోవాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. భార్గవ్రామ్పై నమోదైనవి తప్పుడు కేసులే అన్నారు. క్రషర్లో ఆయనకూ భాగం ఉందని, ఆయన ఎవరిపైనా దాడి చేయలేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఒకవేళ తాము వార్నింగ్ ఇవ్వాలనుకుంటే మంత్రిగా ఉన్నప్పుడే ఆ పనిచేసేవాళ్లమని అఖిలప్రియ అన్నారు. తప్పుడు కేసులు బనాయించడం, ఆస్తులు లాక్కోవడం వంటి పనులకు తాము ఎప్పుడూ పాల్పడలేదని, ఈ విషయం ఆ క్రషర్ భాగస్వామికి కూడా తెలుసని అన్నారు. తమ కుటుంబానికి మంచి పేరుందన్నారు. కేసులు తమకు కొత్తకాదని, ఇంతకంటే దారుణమైన పరిస్థితులను కూడా తాము ఎదుర్కొన్నామని తెలిపారు. న్యాయ పోరాటం చేస్తున్నామని, తమకు న్యాయం జరుగుతుందని అఖిలప్రియ ఆశాభావం వ్యక్తం చేశారు.
