ప్రస్తుతం యావత్ దేశ క్రికెట్ అభిమానుల దృష్టి ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ పైనే ఉంది. ఇదే సమయంలో విజయ్ హజారే ట్రోఫీ కూడా జరుగుతుంది. దీనిని మాత్రం ఎవరూ పట్టించుకునే నాధుడే లేదు. కాని అసలు ఆట ఇక్కడే ఉంది. భారత జట్టులో స్థానం సంపాదించాలి అంటే ఇందులో రానించాలి. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో కేరళ కుర్రాడు ఒక రికార్డు సృష్టించాడు. అతడు మరెవ్వడో కాదు సంజు శాంసన్. ఇంతకు ఈ ఆటగాడు ఏం సాధించాడంటే గోవాతో జరుగుతున్న మ్యాచ్ లో ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 129 బంతుల్లో 212 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 21ఫోర్లు, 10సిక్స్ లు ఉన్నాయి.
