థాయిలాండ్ లోని ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక జాతీయ పార్కులోని గల జలపాతంలో ఆరు ఏనుగులు జారిపడి మృత్యువాతపడ్డాయి.ఈ దారుణం శనివారం నాడు చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు రెండు ఏనుగులు కాపాడినప్పటికి మిగతావి అప్పటికే ప్రాణాలు కోల్పోయాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమీపంలో ఈ సంఘటన జరగగా..జలపాతంలో చిక్కుకున్న వాటి ఆర్తనాదాలు విన్న అధికారులు వెంటనే సహాయక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
