Home / ANDHRAPRADESH / ఈ నెల 29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం…!

ఈ నెల 29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం…!

ఒక పక్క తిరుమల బ్రహ్మోత్సవాలు, మరోపక్క దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఏపీ అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బెజవాడ ఇంద్రకీలాద్రిలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు భక్తులచే పూజలందుకుంటారు. నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా..కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాగా అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజైన అక్టోబర్ 5 న ఆంధ‌్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు, పసుపుకుంకుమ, గాజులు, పూలు, పండ్లు అధికారికంగా సమర్పిస్తారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా 5 వ తేదీన దుర్గమ్మ గుడిలో వీఐపీల దర్శనం రద్దు చేసిన అధికారులు అన్ని క్యూలైన్లను సర్వదర్శనంగా పరిగణిస్తామని ప్రకటించారు. ఇక ఇంద్రకీలాద్రిపై జరిగే శరన్నవరాత్రులలో ప్రత్యేక ఆకర్షణ..అమ్మవారి తెప్పొత్సవం..విజయదశమి రోజు అంటే అక్టోబర్ 8న కృష్ణానదిలో అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరుగనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat