మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రం పై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా సినిమా పై స్పందించాడు. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి గారికి సరికొత్త మలుపు కాబోతుందని అన్నారు. అంతేకాకుండా చిత్ర నిర్మాత రామ్ చరణ్ తండ్రికి మరియు అభిమానులకు ఈ సినిమా ద్వారా మంచి బహుమతిని అందిచబోతున్నాడని అన్నారు. ఈ ట్వీట్ కు సంబంధించి చాలా ఆశ్చర్యకరమైన కామెంట్స్ వస్తున్నాయి.. మీ నోటినుండి ఇలాంటి మంచి మాటలు కూడా వస్తాయా అన్నట్టు కామెంట్స్ వస్తున్నాయి.
WOWWWW! #SyeRaa is an ultimate befitting tribute to the phenomenon of MEGA STAR CHIRANJEEVI GARU ..Kudos to Producer RAM CHARAN for giving this gift to both his father and the audience ??? https://t.co/HE7djQ4fua
— Ram Gopal Varma (@RGVzoomin) September 26, 2019