ఏపీ రాజధాని నగరం విజయవాడలో సీఐ సూర్యనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక హనుమాన్పేట పోలీస్ క్వార్టర్స్లోని తన నివాసంలో సీఐ సూర్యనారాయణ ఫ్యాన్కు ఉరివేసుకున్నారు. సీఐ ఆత్మహత్య ఘటనపై పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనారోగ్య కారణాలతోనే సీఐ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా 1989 బ్యాచ్కు చెందిన సూర్యనారాయణ గత కొంతకాలంగా విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్లో సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మానసికంగా ఆందోళనకు గురైన సూర్యనారాయణ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు. సీఐ మృతిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
