టీమిండియా జట్టులో ప్రస్తుతం కలకలం రేపుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అది కీపర్ గురించే. ఇప్పటికే ఆర్మీ ట్రైనింగ్ కొరకు మాజీ కెప్టెన్ మరియు కీపర్ ఎంఎస్ ధోని విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చేసినప్పటికీ ఆటపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక మొన్నటివరకు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ జరగగా అందులో మొదటిది వర్షం కారణంగా రద్దయింది. ఇక రెండో మ్యాచ్ ఇండియా, మూడో మ్యాచ్ సౌతాఫ్రికా గెలుచుకున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే రిషబ్ పంత్, తనకి ఎన్ని అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోజగం చేసుకోలేకపోతున్నాడు. దీంతో సీనియర్ ఆటగాళ్ళు సైతం అతడిపై చాలా కోపంగా ఉండడమే కాకుండా తనని జట్టునుండి తొలిగిస్తే అప్పుడే తనకి తెలిసొస్తుందని అంటున్నారు.
