ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ఫలితాల(మార్కులు)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రామ సచివాలయ పరీక్షల్లో 2478 మంది అభ్యర్థులకు సున్నా మార్కులు వచ్చాయి.మరికొందరికి సున్నా కంటే తక్కువగా మైనస్లలో మార్కులు వచ్చాయి. పరీక్షలో నెగటివ్ మార్క్స్ ఉండటంతో ఇలా వేల మందికి సున్నా మార్కులు వచ్చినట్లు తెలుస్తుంది. మరోపక్క కేటగిరీ-1 లోని పంచాయితీ కార్యదర్శి,డిజిటల్ కార్యదర్శి వంటి పోస్టుల క్వశ్చన్ పేపర్స్ చాలా కఠినంగా వచ్చాయని కొంతమంది అభ్యర్థులు వాపోతున్నారు. గ్రూప్-1,2 స్థాయిలో ఆ ప్రశ్నలు ఉన్నాయని.. అందుకే 11.63లక్షల మంది పరీక్షలు రాయగా.. 1588 మందికి సున్నా అంతకన్నా తక్కువ మార్కులు వచ్చాయంటున్నారు.
