ప్రముఖ నటి, దర్శకురాలు రేణూదేశాయ్ డెంగీ బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా ఆమె తెలిపారు. అంతేకాకుండా జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రతిఒక్కరికి వివరించారు. డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న సమయంలో షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇలా ఉన్నాను అంటూ ఓ ఫొటో పోస్టు చేశారు. ”ఈటీవీలో ప్రసారం చేయబోయే ‘ఢీ ఛాంపియన్’ షో కోసం కొన్ని గంటలపాటు షూటింగ్కి నేను నో చెప్పలేకపోయాను. దోమల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. పొడవైన దుస్తులనే వాడండి” అని రేణూ దేశాయ్ పేర్కొన్నారు.
