పార్లమెంటరీ స్థాయి సంఘాలను నియమిస్తూ లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఈ రోజు జాబితా ప్రకటించారు. పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ గా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె .కేశవ రావు నియమితులయ్యారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీ లో 21 మంది లోక్ సభ సభ్యులు ,పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు .ప్రతిష్టాత్మక కమిటీ కి తనను చైర్మన్ గా ఎంపిక చేయడం పట్ల కేశవ రావు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన కె .కె . పరిశ్రమల పై పార్లమెంటరీ స్థాయి సంఘానికి తనను చైర్మన్ గా ఎంపిక చేసిన విషయాన్ని తెలియజేశారు. సీఎం కేసీఆర్.. కేశవ రావు కు శాలువా కప్పి అభినందనలు తెలియ జేశారు.