వైసీపీ సీనియర్ నేత వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి మీరు చేసిందే అదే కదా చంద్రబాబు అని ప్రశ్నించారు. మరో ట్వీట్ లో మీ పాలనలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్వం చేసి పోలీసులకు పచ్చ యూనిఫాం తొడిగించారు. అందుకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండు చేశారు. ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. డౌట్ ఉంటే శాంపిల్గా కోడెల కుటుంబం కేసులను సీబీఐకి అప్పగించమని అడగొచ్చు చంద్రబాబు గారూ అని ట్వీట్ చేసారు.
మీ పాలనలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్వం చేసి పోలీసులకు పచ్చ యూనిఫాం తొడిగించారు. అందుకే @ysjagan గారు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండు చేశారు. ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. డౌట్ ఉంటే శాంపిల్గా కోడెల కుటుంబం కేసులను సీబీఐకి అప్పగించమని అడగొచ్చు @ncbn గారూ. @JaiTDP
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 10, 2019
పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి మీరు చేసిందే అదే కదా. @ncbn @naralokesh @JaiTDP
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 10, 2019