మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రాన్ని తనయుడు రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గాను తమిళ్ లో కమల్ హాసన్ తో డబ్బింగ్ చేయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సైరా యూనిట్ అతడిని దూరం పెట్టిందట. మరి ఆ స్థానంలో చిరంజీవికి వాయిస్ చెప్పడానికి వచ్చేది ఎవరు అనే విషయానికి వస్తే.. అతడు మరెవరో కాదు కాలీవుడ్ స్టార్ అరవింద స్వామి..చిరంజీవికి తమిళ్ లో డబ్బింగ్ చెప్పడానికి అరవింద్ ఓకే చెప్పాడట.
