అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు శ్రీదేవి మైనపు విగ్రహాన్నిసింగపూర్లోని మ్యూజియంలో ఆవిష్కరించారు. భారతీయ సినీ రంగానికి ఆమె అందించిన సేవలకుగానూ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతురు జాన్వి పాల్గొన్నారు. బంగారు వస్త్రాలను ధరించి, తలపై కిరీటంతో శ్రీదేవి దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది. శ్రీదేవి, అనిల్ కపూర్ కాంబినేషన్లో 1987లో వచ్చిన ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలోని ‘హవా హవాయి’ పాట లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు.
I could practically hear the heartbreak in #boneykapoor ‘s voice. Such tremendous love he had for #Sridevi ❤️? pic.twitter.com/5lnXrTvUj4
— ? (@allthatisshals) September 4, 2019