ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో కి చేరికలు జరుగుతున్నాయి. ఈరోజు విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో మరోసారి చేరికలు భారీగా ఉంటాయనే సంకేతాలను ఇచ్చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే మరిన్ని చేరికలు ఉండబోతున్నాయి… ఆసక్తికర చేరికలు ఉంటాయని ప్రకటించారు. చంద్రబాబు అధికారం కోల్పోయాక కూడా తన తీరు మార్చుకోలేదు.. దీంతో టీడీపీ నేతలు విసిగిపోతున్నారని.. అందుకే బడా నేతలు తమ వైపు చూస్తున్నారనే విజయ సాయి రెడ్డి తెలిపారు.
