సెప్టెంబరు 2వ తేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనకు వస్తున్నారని, పర్యటన విజయవంతానికి పటిష్ఠవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ హరి కిరణ్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 2వ తేది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇడుపులపాయ, పులివెందులలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందన్నారు. సెప్టెంబరు 2వ తేది ఉదయం ప్రత్యేక విమానంలో సీఎం కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్లో ఇడుపులపాయకు వెళతారన్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి పులివెందులకు చేరుకుంటారన్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి విహ్రావిష్కరణ చేసి అనంతరం పులివెందుల ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకుంటారన్నారు. అక్కడ పాడాకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహిస్తారన్నారు. సమావేశానంతరం పులివెందుల నుంచి హెలికాఫ్టర్లో కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారని వివరించారు.
