ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ సచివాలయాలు ఇక వైసీపీ రంగుల్లోకి మారిపోనున్నాయి . అక్టోబరు 2 నుంచి అమలులోకి వచ్చే గ్రామ సచివాలయాల భవన నమూనాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లాలకు పంపింది. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న పంచాయతీ భవనాలను ఇదే విధంగా మార్పులు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేసే చోట ఇదే విధానాన్ని అమలు చేయాలని పంచాయతీరాజ్శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కలెక్టర్లకు సూచించారు.
