తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు,మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డి రాజకీయాలకు పనికి రాడని, సెటిల్మెంట్లు, కబ్జాలకు పనికొస్తాడని ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతపోరు ఎక్కువైంది.
పీసీసీ పదవి కోసం రేవంత్ చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్రావు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలోనూ విద్యుత్ శాఖలో పనిచేశారన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని వెంకటేశ్వర్లు సూచించారు. ‘ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్రెడ్డి.
జెన్కో సీఎండీ ప్రభాకర్రావు చాలా సమర్థమైన వ్యక్తి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభాకర్రావు అద్భుతంగా పనిచేస్తున్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్లకు నచ్చడం లేదు. సీఎం కేసీఆర్, జెన్కో సీఎండీ ప్రభాకర్రావులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని’ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.