Home / Uncategorized / కర్నూల్ జిల్లాలో మంత్రి బుగ్గన 70వ వన మహోత్సవ కార్యక్రమం

కర్నూల్ జిల్లాలో మంత్రి బుగ్గన 70వ వన మహోత్సవ కార్యక్రమం

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అడవుల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 70వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో విద్యార్థులతో కలిసి సీఎం జగన్‌ మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వన మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. శని వారం నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో బాగాంగ కర్నూల్ లోని గార్గేయపురం సమీపంలో నగరవనం లో 70వ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని చెట్లని నాటారు ఆర్థిక శాఖ, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ,పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికోట్కూరు ఎమ్యెల్యే ఆర్థర్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీ గణేష్ వీరపాండ్యన్ , జిల్లా ఎస్పీ గారు, జిల్లా ఫారెస్ట్ అధికారులు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat