మోడీ సర్కారు తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది. కంపా కింద రాష్ట్రానికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. ఢిల్లీలోని పర్యావరణ భవన్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.శోభ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.3,110 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.
