అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అక్కినేని అఖిల్ కొత్త చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ని ఫిక్స్ చెయ్యలేదట. తాజాగా అందిన సమాచారం ప్రకారం అక్కినేని అఖిల్ కి జంటగా మహర్షి తో మంచి హిట్ కొట్టిన పూజా హెగ్డే ను అనుకుంటున్నారట. ఈ మేరకు ఈ భామను సంప్రదించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి గాను ఈ ముద్దుగుమ్మ 3.5 కోట్లు అడుగుతుందట. పూజా హెగ్డే ఇప్పటికే వరుస సినిమాలలో నటిస్తూ హిట్ లు తన ఖాతాలో వేసుకుంటుంది. మరి వరుస ఫ్లాప్ లతో ముందుకు పోతున్న అఖిల్ కు ఈసారైన హిట్ వరిస్తుందో లేదో చూడాలి.
