వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో వాసిరెడ్డి పద్మ పాత్ర అసాధారణమైనదని అన్నారు. జగన్ ఆలోచనకు అనుగుణంగా పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని తెలిపారు. అలాగే జగన్ ఆమెను స్టీల్ లేడి అని పిలుస్తుంటారని కొత్త విషయం చెప్పారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని, మహిళా సమస్యలపై ఆమె ఫోకస్గా వ్యవహరిస్తారని సజ్జల విశ్వాసం వ్యక్తంచేశారు. సాధికారికత దిశగా మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ మోహన్ రెడ్డి చట్టానికి ఆమోదం తెలపడం చరిత్రాత్మక నిర్ణయమని ప్రశంసించారు. రానున్న ఐదేళ్లలో దివంగత రాజశేఖరరెడ్డి ఆశయాలకు, వైయస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా వాసిరెడ్డి పద్మ పని చేస్తారని సజ్జల విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి వాసిరెడ్డిపద్మను స్టీల్ లేడి అని పిలిచేవారని సజ్జల చెప్పగానే సభికులంతా హర్షం వ్యక్తం చేసారు. ఆమెను తన ఇంటి ఆడపడుచులాగా సీఎం చూసుకున్నారని సజ్జల చెప్పారు.
