Home / ANDHRAPRADESH / వైరల్ ఫోటో…స్టోక్ కాంగ్రీ పర్వతంపై జగన్ బ్యానర్…!

వైరల్ ఫోటో…స్టోక్ కాంగ్రీ పర్వతంపై జగన్ బ్యానర్…!

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రం జమ్ము కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా లడఖ్‌ ప్రాంతంలోని 6,153 మీటర్ల ఎత్తైన స్టోక్‌ కాంగ్రీ పర్వతాన్ని ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు అధిరోహించారు. చిలకలూరిపేటకు చెందిన ఆలూరి సాయికిరణ్, తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎల్లికల్‌ గ్రామానికి చెందిన మల్లికార్జున, హన్మకొండకు చెందిన ఆర్‌. అఖిల్‌లు ఈ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించారు. ఈ యాత్రకు సంబంధించి తనకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ తోడ్పాటునందించారని మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీలపై అభిమానంతో సాయికిరణ్‌ బ్యానర్‌ ప్రదర్శించారు. ఇప్పుడు ఈ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat