తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ఎన్.ఎస్.పి. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో అధికారులు క్రస్ట్ గేట్లు తెరిచారు.
సాగర్ జలాశయానికి ఇన్ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 557 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 226 టీఎంసీలు ఉంది.