అంకం మల్లయ్య,గోగుల మల్లయ్యలు ఇప్పుడు యావత్తు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా మారిపోయారు..ఒకరికేమో కుడిచేయి లేదు. మరోకరికి మాటలు రావు. అయితేనేమి తాము దేనికి తక్కువ కాదన్నట్లు అందరిలెక్కనే పచ్చదనాన్ని పెంచడంలో తమ వంతు కృషి చేస్తున్నారు.
రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన అంకం మల్లయ్య,గోగుల మల్లయ్య ఉపాధి హామీ పనిలో భాగంగా హరితహారంలో పాల్గోన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతూ హరితస్ఫూర్తిని చాటుతున్నారు.
కుడిచేయి లేని అంకం మల్లయ్య,మాటలు రాని గోగుల మల్లయ్య జోడుగా కలిసిమెలిసి కడ్పల్ నుంచి ఖాజాపూర్ వెళ్ళేదారిలో ఇరువైపులా హరితహారం రెవిన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వి మొక్కలు నాటే దినసరి వేతన ఉపాధి పనిలో వీరిద్దరూ బిజీ అయ్యారు. వీరి పనితీరును చూసిన పలువురు అభినందిస్తున్నారు.