Home / ANDHRAPRADESH / ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడినుంచి నేరుగా హెలికాప్టర్‌లో

ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడినుంచి నేరుగా హెలికాప్టర్‌లో

తాజాగా కురిసిన వర్షాల కారణంగా వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే.. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు గత 10రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న జగన్ అక్కడినుంచే నేరుగా హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వేకు వెళ్లారు. ఏరియల్‌ సర్వే తర్వాత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి తో మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, అనిల్‌ కుమార్‌ యాదవ్ ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ ఇచ్చిన ఆదేశాలతో అందరూ షాకయ్యారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రభుత్వం ఇస్తున్న సాయంతో పాటు అదనంగా మరో 5వేలు ఇచ్చేయాలని జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి ఇప్పటికే భోజనాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టారు. అయితే ఇవికాకుండా అదనంగా 5వేలు సాయం చేయాలని సీఎంసూచించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించాక జగన్ కాఫర్‌ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్‌ నుంచి పరిశీలించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat