చింతమడక లో జరిగే ఆరోగ్య సూచిక దేశానికే ఆదర్శంగా నిలవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి సౌజన్యంతో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనతో చింతమడక లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సియం కేసీఆర్ గారు, యశోద ఆస్పత్రి వారి కృషితో ఉచిత ఆరోగ్య సూచిక ఏర్పాటు చేశాము. ఇక్కడ ప్రతిరోజు 500మందికి ఆరోగ్య పరీక్షలు జరుగుతాయి. గ్రామంలో ప్రతి మనిషి కి అన్ని ఆరోగ్య పరిక్షలు చేస్తారు. ఇక్కడ ప్రారంభంమైన ఆరోగ్య సూచిక రాష్ట్రంలో త్వరలో మొత్తం జరుగుతుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాగనే ఆరోగ్య సూచిక దేశనికి ఆదర్శనంగా నిలుస్తుంది. 40ఏండ్లు దాటినా ప్రతి మహిళ క్యాన్సర్,గుండె జబ్బు టెస్టు చేసుకోవాలి. అత్యవసరం లాంటి సర్జరీలు ఉంటే సియం గారితో మాట్లాడి వాటికోసం చర్యలు తీసుకుంటాము. త్వరలో కండ్లు, పళ్లకు ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తాము. మందులు తీసుకున్న ప్రతిఒక్కరు మందులు మంచిగా వాడుకోవాలి. మిషన్ భగీరథ , మిషన్ కాకతీయ , రైతు బంధు, కేసీఆర్ కిట్ లాంటి మన రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి ప్రతి ఒక్కరి ఆరోగ్య సూచిక తో మరో పథకానికి రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవనుంది. మన సిద్దిపేట నియోజకవర్గం చింతమడక నుండే ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న” అని అన్నారు.
