జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ప్రవేశాల కౌన్సిలింగ్కు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు రాజేంద్రనగర్లో కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చర్, బీవీఎస్సీ, ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఎస్సీ హార్టీకల్చర్ కోర్సులకు కౌన్సిలింగ్ నిర్వహణ జరగనుంది. ఎంసెట్-2019 ర్యాంకు ఆధారంగా అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరగనున్నట్లు వర్సిటీ రిజిస్టార్ తెలిపారు.
