Home / 18+ / టీటీడీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు ఎల్లో మీడియా కుట్ర‌లు.. ఎట్టి ప‌రిస్థితుల్లో ఉపేక్షించం

టీటీడీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు ఎల్లో మీడియా కుట్ర‌లు.. ఎట్టి ప‌రిస్థితుల్లో ఉపేక్షించం

టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్‌ను నియమించారంటూ తప్పుడు వార్తను ప్ర‌చురించిన టీవీ5 పై చ‌ట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని, త‌ప్ప‌కుండా కేసులు కూడా పెడతామ‌ని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి టీవీ5 ప్రయత్నించిన విష‌యం తెలిసిందఏ.. స‌ద‌రు టీవీ–5 ఛానెల్‌ తన వెబ్‌సైట్లో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని వైవీ సీరియ‌స్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన యాభై రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ మరింత దిగజారిందన్నారు.

 

సీఎం జగన్‌ చేస్తున్న మంచి పనులను స్వాగతించలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో వ్యవహరిస్తున్నారని,టీటీడీలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించలేకపోతున్నారన్నారు. దేవుడి ముందు అందరూ సమానులేన‌ని తాము నిరూపిస్తుంటే, ఆ చర్యలను జీర్ణించుకోలేకపోతున్నారని, అబద్ధాలు, దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టను, వైయస్‌.జగన్‌ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఎల్లోమీడియాను వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారని, ఇలా విషప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామ‌న్నారు వైవీ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat