తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత పాలనకోసం జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలంటూ నిర్ణయం తీసుకోవడంతో మాజీ సీఎం చంద్రబాబు కోటరీ వెన్నులో వణుకు మొదలైందని వైసీపీ రాజ్యసభసభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ‘చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకూ ఏనాడూ కౌలు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, జగన్ 15.30 లక్షల మంది కౌలుదార్లకు రైతు భరోసాతో పాటు అన్ని పథకాలు వర్తించేలా నిర్ణయం తీసుకున్నారన్నారు.
నాయకుడికి, భ్రమలు కల్పించి నాటకాలాడే వారికి తేడా ఇదే మరి అన్నారు.. జుడీషియల్ కమిషన్, రివర్స్ టెండరింగ్, విద్యుత్తు పీపీఏలపై సమీక్ష వంటి నిర్ణయాలతో చంద్రబాబు, ఆయన కోటరీ వెన్నులో వణుకు మొదలైందని, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారని, కొందరు పార్టీ మారి ఎస్కేప్ రూట్ పట్టినా తప్పించుకోలేరంటూ ట్విట్టర్లో చురకలేసారు.