భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా చెప్పినట్టుగానే మధ్యాహ్నం సరిగ్గా 2.43గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లింది.దేశం మొత్తం దీనిని ప్రజలు చూసారు. మొన్న జులై 15న జరగాల్సిన ఈ ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాలతో నిలిచిన విషయం అందరికి తెలిసింది. అయితే ఎట్టకేలకు ఈరోజు దానిని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ నుండి బయలుదేరిన రాకెట్ 16.13 నిమిషాలు ప్రయాణించిన చంద్రయాన్-2ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది.
