ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే మొత్తం 94 మంది డీఎస్పీలను బదిలీచేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జులై 15న 45 మంది డీఎస్పీలను బదిలీచేసిన విషయం తెలిసిందే. తాజాగా 45 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో కొందరికి వేరే చోట పోస్టింగ్లు ఇవ్వగా, కొందర్ని హెడ్ క్వార్టర్స్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. బదిలీ చేసినవారిలో కొందరికి రాయలసీమ జిల్లాలు, ఇంకొందరికి మిగతా జిల్లాల్లో పోస్టింగ్లు దక్కాయి. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ సహా పలువురు డీఎస్పీలని మళ్లీ హెడ్ క్వార్టర్ కి బదిలీ చేయడం విశేషం. అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఇంత పెద్దఎత్తున బదిలీలు చేపట్టిన దాఖలాలు లేవని అంటున్నారు.
