ఆస్ట్రేలియాకు చెందిన ఫెయిర్ ఫాక్స్ పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో వెస్డిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ విజయం సాధించాడు. గేల్ పరువుకు నష్టం కలిగించినందుకు దాదాపు కోటిన్నర రూపాయలు చెల్లించాలని న్యూసౌత్ వేల్స్ న్యాయస్థానం తీర్చు ఇచ్చింది. 2015 వరల్డ్ కప్ సందర్భంగా సిడ్నీ స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్ లోకి మసాజ్ చేయడానికి వచ్చిన మహిళ పట్ల గేల్ అసభ్యం గా ప్రవర్తించాడని ఫెయిర్ఫాక్స్ పత్రిక కథనం ప్రచురించింది. దీనిపై 2016లో గేల్ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు గతేడాది అక్టోబర్ లోనే గేల్కు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే పరిహారం సరిపోలేదంటూ గేల్, విచారణ సరిగ్గా జరగలేదని ఫెయిర్ఫాక్స్ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.దీని పై విచారణ చేసిన కోర్టు వీళ్ల అప్పీల్ను తిరస్కరించింది.
