తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను జులై 18, 19 తేదిల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు 18న అసెంబ్లీ, 19న మండలి సమావేశం కానున్నది. జులై 18న బిల్లు పత్రాలను శాసన సభ్యులకు అందచేసి దానిమీద చర్చించడానికి ఒక రోజు సమయం ఇచ్చి జులై 19న చర్చించి చట్టంగా ఆమోదం పొందుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఉద్దేశించిందని, ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఈ సందర్భంగా ఉండవు. మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా మున్సిపల్ బిల్లుకు తుదిరూపుం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపినట్లు సీఎం తెలిపారు.
