Home / ANDHRAPRADESH / బీజేపీలో ఏపీ టీడీపీ విలీనం..!

బీజేపీలో ఏపీ టీడీపీ విలీనం..!

ఏపీలో అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.టివి 9 చానల్ తో ఆయన మాట్లాడారు. త్వరలో బిజెపిలో టిడిపి విలీనం అయ్యే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారని ఆ చానల్ లో వార్త వచ్చింది. మళ్లీ తాము బిజెపితో కలుస్తామని, తామే బిజెపితో తాళి కట్టించుకుంటామని ఆయన అన్నారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండురోజుల అనంతపురం జిల్లా పర్యటన చేసిన సయమంలోనే ప్రభాకరరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.ఇప్పటికే ధర్మవరం మాజీ టిడిపి ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇప్పటికే బిజెపిలో చేరిపోయారు.జెసి సోదరులు కూడా బిజెపిలో చేరవచ్చని ప్రచారం జరిగింది.అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బిజెపితో కలవడమే మార్గమని ప్రభాకరరెడ్డి అన్నారు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఆయన అన్నారు.ఎపి బిజెపికి చంద్రబాబు అవసరం ఉందని ఆయన అన్నారు.నరేంద్ర మోడీకి చంద్రబాబు ఐడియాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని కూడా జెసి మెచ్చుకోవడం విశేషం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat