పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్మాలిక్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా మ్యాచ్ అనంతరం మాలిక్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా పాక్ క్రికెటర్లు అతడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రపంచకప్లో మాలిక్ మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఎనిమిది పరుగులే చేశాడు. రెండు మ్యాచ్ల్లో డకౌట్గా వెనుతిరిగాడు. అయితే టీమిండియా మ్యాచ్లో అతడి ప్రదర్శనపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాడు. మ్యాచ్కు ముందు రోజు మాలిక్ తన భార్యతో కలిసి డిన్నర్లో పాల్గొన్నాడనే ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం తనని చాలా బాధ పెట్టిందని మాలిక్ అప్పట్లో తెలిపాడు.
Hugs galore
Guard of honour
Plenty of applause
Pakistan gave Shoaib Malik a fitting send-off as he retired from ODI cricket ?#CWC19 pic.twitter.com/ESA4q1sLUM
— Cricket World Cup (@cricketworldcup) July 5, 2019