ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.టీడీపీలో సీనియర్ నాయకులు హేమాహేమీలు సైతం ఓడిపోయారు.ఆ పార్టీ మంత్రులు కూడా జగన్ దెబ్బకు బిట్టిరిపోయారు.అయితే టీడీపీ మాజీ డిప్యూటీ సీఎం,హోమ్ మినిస్టర్ చినరాజప్ప మాత్రం ఏదోలా కష్టపడి గెలిచేసారు.అయితే ఇప్పుడు ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి తోట వాణి హైకోర్టును ఆశ్రయించారు.చినరాజప్ప చాలా అన్యాయాలు,అక్రమాలు చేసాడని అంతేకాకుండా అతడిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని అలాంటి వ్యక్తి ఎన్నికల అఫిడవిట్లో అవన్నీ దాచిపెట్టి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడని..ఆయన ఎన్నికలకు అర్హుడు కాదని ఆమె హైకోర్టులో అనర్హత పిటిషన్ వేసింది.ఓబులాపురం మైనింగ్ కార్యాలయం కేసుపై చినరాజప్ప 15వ ముద్దాయిగా ఉన్నారని అన్నారు.