టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం భద్రత కుదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కుదించిన భద్రతను కొనసాగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు మంగళవారం విచారించనుంది.
అయితే గతంలో చంద్రబాబుకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీతో పాటు ముగ్గురు ఆర్ఐ బృందాలతో భద్రత కల్పించారు. తాజాగా ఆ బృందాన్ని కుదించి సెక్యూరిటీ తగ్గించడంతో తనకు కుదించిన భద్రతను తిరిగి కొనసాగించాలని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు ఇప్పటికే డీజీపీ గౌతం సవాంగ్ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన సెక్యూరిటీ ఆయను ఉందని తగ్గించలేదని చెప్పిన సంగతి తెలిసిందే.